కమాన్చౌరస్తా, జూన్ 22: తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురసారాలకు జిల్లాకు చెందిన కవులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, మెట్ట మురళీధర్ రావు, తుమ్మూరు రామ్మోహన్రావు, పెద్దింటి అశోక్కుమార్ ఎంపికయ్యారు. వీరితో పాటు జిల్లాలో పనిచేసి వెళ్లిన అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి రచించిన ‘తెలంగాణ రుబాయిలు’కు పురస్కారం లభించింది. అలాగే, నవలా ప్రక్రియలో మెట్ట మురళీధర్ రచించిన ‘కనిపించని శత్రువు’, కథాసంపుటిలో పెద్దింటి అశోక్కుమార్ రచించిన ‘గుండెల్లో వాన’, ఇతర అంశాల్లో తుమ్మూరి రామ్మోహన్రావు రచించిన ‘మానేరు ముచ్చట్లు’, వరిష్ఠ పురస్కారాల్లో డాక్టర్ గండ్ర లక్ష్మణరావుకు పురస్కారాలు వరించాయి. ఈ సందర్భంగా వారికి జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య, సాహితీ గౌతమి సభ్యులు అభినందలు తెలిపారు. కార్యక్రమంలో గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, నలిమెల భాసర్, దాస్యం సేనాధిపతి, అన్నవరం దేవేందర్, వారాల ఆనంద్, వేణుశ్రీ, గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి, కేఎస్ అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్, కొత్త అనిల్ కుమార్, స్తంభంకాడి గంగాధర్ పాల్గొన్నారు.
టీసీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ
కమాన్చౌరస్తా, జూన్ 22: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్(సీసీఈ) ఆదేశాల మేరకు టీసీఎస్ సహకారంతో యూత్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులకు 45 రోజుల పాటు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. టాస్క్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శోభారాణి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయిన విద్యార్థినులు పీ ఆకాంక్ష, ఎస్ రేఖ, ఎం సుష్మ, జీ కావ్య, బీ ఉషారాణి, ఆర్ అనూష, శ్రీజకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సంపత్కుమార్ రెడ్డి, జీ శ్రీధర్ రావు, ఐక్యూ ఏసీ కో-ఆర్డినేటర్ డీఎస్ చక్రవర్తి, టాస్క్ ఎంటీఎం రాజశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.