జగిత్యాల కలెక్టరేట్, జూన్ 22: ద్విచక్రవాహనాలు చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్ తెలిపారు. బుధవా రం సాయంత్రం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. జగిత్యాల టౌన్ ఎస్ఐ అబ్దుల్ రహీం జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి వాహన ధ్రువీకరణ పత్రాలు అడిగారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారించగా, జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లికి చెందిన వడ్లూరి నాగరాజుగా తేలింది.
అతని వద్ద లభించిన బైక్ను జగిత్యాలలోని అరవింద్నగర్లో దొంగిలించాడని ఒప్పుకున్నాడు. నాగరాజు తన స్నేహితుడు టీఆర్నగర్కు చెందిన అక్తర్తో కలిసి జగిత్యాలలో చోరీ చేసిన 11 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు పంపించారు. నాగరాజు పదేండ్లనుంచి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని డీఎస్పీ తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శ్రీనివాస్, విశాల్ను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ కిశోర్ ఉన్నారు.