పేద కుటుంబాల్లో బిడ్డ పెండ్లి చేయడానికి పడే తపన వర్ణనాతీతం. ఒకప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ప్రతి కుటుంబం ఎంతో భారంగా భావించేది. అలాంటి సందర్భాల్లో అప్పు తెచ్చి మరీ పెళ్లి చేసి ఇబ్బందులు పడేవాళ్లు. ఈ పరిస్థితిని చూసి చలించి పోయిన సీఎం కేసీఆర్ పేదింటి బిడ్డలకు పెద్దన్నగా మారిండు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చి, ఆడబిడ్డల పెండ్లికి పెద్ద సాయం చేస్తున్నడు. పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న పెద్దన్న కేసీఆర్ కావాలా..? పథకాలు వద్దనే వాళ్లు కావాలా..? మీరే ఆలోచించుకోవాలి. మంచి మనసున్న వ్యక్తి కేసీఆర్. ఆడబిడ్డలూ.. నిండు మనసుతో ఆశీర్వదించాలి.
హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 22 : పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న లెక్క సాయం చేసి ఆందుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బిడ్డల పెండ్లి కోసం ఆస్తులమ్ముకున్న గత చరిత్ర తెలంగాణదని, తెలంగాణ బిడ్డలు మన ఆస్తి అని, వారిని సగౌరవంగా చూసుకోవడం కోసమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. ఈటల గతంలో సంక్షేమ పథకాలను పరిగెతో పోల్చి అవమానించారని, అలాంటి వారు మనకు అవసరమా అని ప్రశించారు. ‘పథకాలు వద్దనోళ్లు కావాలా.. పేదింటి పెద్దన్న సీఎం కావాలా..?’ అని మీరే ఆలోచించాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డలకు సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
హుజూరాబాద్లో సిటీ సెంట్రల్హాల్లో పట్టణంతోపాటు మండలంలోని 19 గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 55లక్షల 6వేల380 విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ చెక్కులు అందజేసి మాట్లాడారు. గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్ అని, పేదింటి బిడ్డల కోసమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెచ్చారని కొనియాడారు. వీటితోనే ఆగకుండా పెండ్లి తర్వాత కాన్పు కోసం కార్పొరేట్కు దీటుగా లక్ష వైద్యాన్ని సర్కారు ఉచితంగా అందిస్తున్నదని, మరో 13వేలు కేసీఆర్ కిట్ రూపంలో ఇస్తున్నదని చెప్పారు. పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించడానికి వేల గురుకులాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ పథకాలు లేవని, కేవలం సీఎం కేసీఆర్ దార్శనికతతోనే అమలవుతున్నాయని చెప్పారు. మోడీ సీఎంగా చేసిన గుజరాత్లో, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
కేవలం తెలంగాణలోనే.. అదీ కేసీఆర్ సరార్ మాత్రమే ఎన్నో పథకాలను పేదల కోసం అందిస్తున్నదని చెప్పారు. మంచి మనసున్న సీఎం కేసీఆర్ మనకున్నారు కాబట్టే ఈ పథకాలు వస్తున్నాయనేది గుర్తించాలన్నారు. కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా ఆర్థికంగా కుంగిపోయినా, రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం సరిగ్గా రాకున్నా పేదలకు అందిస్తున్న ఏ ఒక సంక్షేమాన్ని కేసీఆర్ ఆపలేదని గుర్తు చేశారు. కష్టకాలంలో ప్రతి పేద కుటుంబం కడుపు నింపేందుకు 15 కిలోల ఉచిత బియ్యం, రూ.500 అందించిన ఏకైక ప్రభుత్వం అని అభినందించారు. ఇంతలా మనకు అండగా ఉండి ఆదరించే ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలు అందించాలని, మరింత కాలం ఎకువ సేవ చేసేలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు, ఆర్డీవో రవీందర్రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, సర్పంచులు మంద మంజుల, గూడూరు ప్రతాప్రెడ్డి, తాటికొండ పుల్లాచారి, కౌన్సిలర్లు కళ్లెపల్లి రమాదేవి, ముత్యంరాజు, ప్రతాప తిరుమల్రెడ్డి, కేసీరెడ్డి లావణ్య, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
అన్నం పెట్టే కేసీఆర్ను మరువం
కూతురుతో కలిసి చెక్కును చూపుతున్న ఈ మహిళ పేరు పోగుల స్వరూప. హుజూరాబాద్లోని మార్కెట్ ఏరియా. బీడీ కార్మికురాలిగా పని చేస్తున్నది. ఆమె భర్త సమ్మయ్య ప్రైవేట్ స్కూల్ వ్యాన్ క్లీనర్. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. ముగ్గురు కూతుళ్లు. 17ఏళ్ల క్రితం పెద్ద కూతురుకు పెండ్లి చేసిన్రు. మూడేళ్ల క్రితం రెండో కూతురు జానకి పెండ్లి చేసిన్రు. నాలుగు నెలల క్రితం మూడో కూతురు నవతకు వివాహం జరిపించిన్రు. రెండో కూతురు జానకి, మూడో కూతురు నవతకు రూ.లక్ష చొప్పున కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చినయ్. ప్రభుత్వం ద్వారా 2లక్షల సాయం అందింది. స్వరూపకు బీడీ కార్మికురాలి పింఛన్ కింద నెలకు 2016 వస్తున్నయ్. ప్రభుత్వం ఆదుకోకపోతే తాము ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడేవాళ్లమని స్వరూప చెబుతున్నది. అన్నం పెట్టిన కేసీఆర్ను ఎన్నటికీ మరువమని, రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే ఓటు వేస్తామని స్పష్టం చేసింది.
పథకాలు వద్దన్నోళ్లు కావాలా..
గెల్లు సీనుకు ఓటెస్తం
నాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డకు ఏడేండ్ల కింద పెండ్లి చేసిన. రెండో బిడ్డ పెండ్లికి డబ్బులకు ఇబ్బంది అయింది. కల్యాణలక్ష్మి వస్తుందనే ధైర్యం నాలో ఉండె. అనుకున్నట్టే కల్యాణలక్ష్మి వచ్చిం ది. ప్రభుత్వ సాయాన్ని ఎప్పటికి మరువం. ఇటువంటి మంచి పథకాలు మాలాంటోళ్లను ఎంతగానో ఆదుకుంటయి. ఉప ఎన్నికలో కేసీఆర్ సారు నిలబెట్టిన గెల్లు సీనుకు ఓటెస్తం.
ఎప్పటికీ ఈ సర్కారే ఉండాలి..
మా భర్త సాదిక్ పాన్షాపు నడుపుతడు. ముగ్గురు బిడ్డలను, నన్ను సాదుతుండు. ఆరు నెలల క్రితం పెద్ద బిడ్డ ఆసియాబేగం పెండ్లి చేసినం. ఆర్థికంగా కొంచం దెబ్బతిన్నం. ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్షా116 చెక్కుతో మా కుటుంబానికి ఎంతో ఊరట అయింది. ఈ రోజు మేము ఎప్పటికీ మరిచిపోం. ఎప్పటికీ కేసీఆర్ సర్కారే ఉండాలి.
రుణపడి ఉంటరు..
పెండ్లి చేస్తే వచ్చి పోయే చుట్టాలే రూ.వంద కట్నం పెట్టడానికి ఎన్కాముందైతరు. కానీ, సీఎం కేసీఆర్ సారు ఎంతో మంది పేదింటి బిడ్డలకు రూ.లక్షా 116 ఇచ్చి ఆదుకుంటున్నరు. ఈ ఆర్థిక సాయాన్ని ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటరు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటరు.
పేదోళ్లకు పెద్దన్నలాంటోడు
మా ఆయన సమ్మయ్య ఆటో డ్రైవర్. మాకు ముగ్గురు బిడ్డలు. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు జేసినం. ఐదు నెలల క్రితం చిన్న బిడ్డ అరణ్యకు కూడా పెండ్లి చేసినం. కానీ, డబ్బులకు మస్తు కష్టమైంది. ఇప్పుడు కల్యాణలక్ష్మి కింద చెక్కు వచ్చింది. కానీ, కేసీఆర్ సారు మాలాంటోళ్లకు పెద్దన్న లెక్క సాయం చేస్తున్నడు. ఆ సారు పదికాలాల పాటు సల్లంగా ఉండాలి. – బండారి పద్మ, దమ్మక్కపేట
సాయం మరువద్దు..
అడిగితే కన్నవారు, పుట్టింటి వారు కూడా ఒక సమయంలో సాయం చేయరు. కానీ, మేనమామ లెక్క సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు. ఈ డబ్బులను పుట్టింటి కట్నంగా భావించాలి. ఈ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు. అడుగకుండానే ఆర్థిక సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలి. రాబోయే ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను గెలిపించి రుణం తీర్చుకోవాలి.
-గందె రాధిక, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్
కేసీఆర్ పేదోళ్ల దేవుడు
కేసీఆర్ సారు పేదోళ్ల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. కల్యాణక్ష్మి ఆడపిల్లల తల్లిదండ్రులకు ధైర్యం నింపుతుంది. మాలాంటి పేదోళ్లను ఆదుకుంటున్న కేసీఆర్ నిజంగా దేవుడు. ఆయన సల్లంగా ఉండాలి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓటేస్తం.