దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా స్థిరపడాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 69 మంది లబ్ధిదారులకు మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్లో కలెక్టర్ రవితో కలిసి యూనిట్లు పంపిణీ చేశారు. 33 మందికి ట్రాక్టర్లు, 33 మందికి ప్యాసింజర్ వాహనాలు, ముగ్గురికి రిటైల్ సెక్టార్లో యూనిట్లను అందజేశారు.
మెట్పల్లి రూరల్, మే 24: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా స్థిరపడాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. దళిత బంధు దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల మండలాలకు చెందిన 69 మంది దళితబంధు లబ్ధిదారులకు మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్లో మంగళవారం కలెక్టర్ రవితో కలిసి యూనిట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని, ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీకి కేవలం మతపిచ్చి ఉందని, అభివృద్ధిపై ధ్యాస లేదని ఆరోపించారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ, దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 33 మందికి ట్రాక్టర్లు, 33 మందికి ప్యాసింజర్ వాహనాలు, ముగ్గురికి రిటైల్ సెక్టార్లో యూనిట్లను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మొత్తం 345 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 118 మందికి యూనిట్లను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో అందజేశామని చెప్పారు. జిల్లాలో మరో 138 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, లావణ్య, ఎంపీపీలు సాయిరెడ్డి, సరోజన, భీమేశ్వరి, నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్లు సుజాత, లావణ్య, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.