మానకొండూర్ రూరల్, మే 24: పిల్లల ఎదుగుదలపై తల్లి దండ్రులు ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామంలోని యాదవ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భిణులు, కిశోర బాలికలతో పాటు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అలాగే గర్భిణులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, కేసీఆర్ కిట్లకు సైతం పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.
సర్కారు దవాఖానల్లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో డాక్టర్లు, సంబంధిత అధికారులు గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో పద్మావతి, డీఎం అండ్ హెచ్వో జువేరియా, సీడీపీవో సబిత, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, తహసీల్దార్ రాజయ్య, సర్పంచ్ వసంత, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, వైస్ ఎంపీపీ గోపు మధుసూదన్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ బియాబాని, ఎంఈవో మధుసూదనాచారి, సూపర్వైజర్ వెంకట లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, పోషణ్ అభియాన్ బృందం, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.