పెద్దపల్లి రూరల్, మే 16: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉండాలని డీఆర్డీవో శ్రీధర్ సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో సోమవారం సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన ఆయన మొక్కలు పెంచుతున్న నర్సరీని పరిశీలించారు. అనంతరం గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచిస్తూ పరిసరాల్లోని రోడ్డు వెంట స్థలాలను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానాన్ని ఉపాధిహామీ పథకంలో చదును చేయాలని సూచించారు. అలాగే ఎస్సారెస్పీ కాలువల వెంట హద్దులను ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు అనుగుణంగా తయారు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో ఎం రాజు, ఎంపీవో సుదర్శన్, సర్పంచ్ తంగెళ్ల జయప్రద-సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎండీ మసీయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మే 16: పెగడపల్లి నర్సరీని అసిస్టెంట్ డీఆర్డీవో సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుం