కమాన్చౌరస్తా, మే 16 : చత్తీస్ఘడ్లోని పండిత్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీలో జరిగే జాతీయ సమైక్యతా శిబిరానికి అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్ హుదాసమ్రీన్ శాతవాహన యూనివర్సిటీ తరఫున ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ వీ రవీందర్రెడ్డి పేర్కొన్నారు.
కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని ఆయన అభినందించి మాట్లాడారు. హుదా సమ్రీన్ ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించే శిబిరంలో పాల్గొంటుందని చెప్పారు. విద్యార్థులకు స్వచ్ఛభారత్తో పాటు వివిధ సృజనాత్మక అంశాలపై శిక్షణ అందిస్తారని చెప్పారు. ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి గోలి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.