మహిళ కడుపులో నుంచి ఐదు కిలోల కణితి తొలగింపు
వేములవాడ డిసెంబర్ 20: వేములవాడ పట్టణంలోని మహతి దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు. సిరిసిల్లకు చెందిన పుష్పలత అనే మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానకు రాగా, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య పరీక్షించారు. కడుపులో కణతి ఉందని గుర్తించారు. ఆపరేషన్కు బంధువుల అంగీకారంతో లాపరోస్కోపింగ్ సర్జన్ అమరేందర్రెడ్డి, మత్తు మందు వైద్య నిపుణులు తిరుపతి వైద్యబృందంతో కలిసి శస్త్రచికిత్స నిర్వహించి దాదాపు 5కిలోల కణతిని తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం పుష్పలత క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పుష్పలత కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.