మెట్పల్లి, డిసెంబర్ 9: టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో శుక్రవారం మెట్పల్లిలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణు లు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు మార్గం గంగాధర్, షేక్మహ్మద్, జావిద్, ఒజ్జెల శ్రీనివాస్, సోమిడి రఘు, మెడిచెల్మెల నాని, షేక్ నవాబ్, రాయల్, బండ రాజేందర్, అలీం, రాజాగౌడ్, సత్యనారాయణగౌడ్, భీమనాతి సత్యనారాయణ పాల్గొన్నారు.
కోరుట్ల, డిసెంబర్ 9: ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశాలతో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు సమీపం లో రహదారిపై పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఒకరినొకరు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ‘దేశకీ నేత కేసీఆర్’ అంటూ నినదించారు. రానున్న రోజు ల్లో అన్ని రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకులు ఎండీ సనావొద్దీన్, యాటం కృష్ణ, చిత్తారి ఆనంద్, ఎండీ మోసి న్, భూపెల్లి నగేశ్, ఎండీ ముబీన్, ఎండీ ఫిర్దోస్, అస్లాం, గఫార్, రెహమాన్, అమీర్, ఇమ్రాన్, షకీల్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 9: టీఆర్ఎస్ను ఈసీ బీఆర్ఎస్గా ఆమోదం తెలుపడంతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కంఠం భారతి, మండల కో ఆప్షన్ మెంబర్ ఏలేటి చిన్నారెడ్డి, ఎంపీటీసీ తిమ్మని రాములు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ బద్దం గోపి, నాయకులు కంఠం రమేశ్, జేడీ సుమన్, రెబ్బటి రాజేందర్, నేమూరి నరేశ్, బొమ్మెన గణేశ్, బోనగిరి భుమేశ్, యూత్ నాయకులు పాల్గొన్నారు.
వెల్గటూర్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన దినం, బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి రవిగౌడ్, ప్యాక్స్ చైర్మన్ గోలి రత్నాకర్, డైరెక్టర్లు జీరెడ్డి మహేందర్రెడ్డి, మాచెర్ల జ్యోతి, కనపర్తి సుధాకర్, కుతాడి నాగరాజు, భూరగడ్డ రవి, ఎండీ అబ్బాస్, ఇప్పల లచ్చయ్య, జల్లెల కనకయ్య, కొంగల చంద్రారెడ్డి ఉన్నారు.