జమ్మికుంట, డిసెంబర్ 6: క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ, రూరల్ సీఐలు రాంచందర్రావు, సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్- జర్నలిస్ట్ 20-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, సీపీ హాజరై క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తారని, పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తారని పేర్కొన్నారు. వృత్తిలో భిన్న ధ్రువాలుగా వ్యవహరిస్తూనే ప్రజల కోసం కలిసి మెలిసి పని చేస్తున్నారని తెలిపారు. పోలీసులు, జర్నలిస్టులు అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు. క్రీడా పోటీలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. పోటీల్లో గెలిచినా.. ఓడినా సరదాగా తీసుకోవాలని సూచించారు. క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేసిన సీఐలను అభినందించారు.
ఇదే స్ఫూర్తితో మరిన్ని మ్యాచ్లు నిర్వహించాలని చెప్పారు. డీసీపీ చంద్రమోహన్, హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు మాట్లాడుతూ, క్రికెట్ పోటీల నిర్వహణ పండుగ వాతావరణాన్ని తలపించిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఏర్పాటు గొప్ప అనుభూతినిచ్చిందని, ఆటలో 20-30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయామని జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు రాంచందర్రావు, సురేశ్, శ్రీనివాస్, జనార్దన్ పేర్కొన్నారు. కాగా, ఈ పోటీల్లో పోలీసు జట్టు విజయం సాధించింది. గెలిచిన, రన్నరప్గా నిలిచిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. అలాగే, పోటీల్లో ప్రతిభ చూపిన వారికి కూడా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, కమిషనర్ సమ్మయ్య, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక ఎస్ఐలు యూనస్, తిరుపతి, శేఖర్రెడ్డి, డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.