రాంనగర్, నవంబర్ 28:వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ యం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పో లీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, వివిధ విభాగాల కు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులు శిక్షింపబడడం ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తాయన్నారు. ఫిర్యాదులను పరిమితికి మించి పెండింగ్లో ఉంచవద్దని, క్లిష్టమైన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిషరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను వేగవంతంగా పరిషరించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు ప్రతినెలా రివార్డులను అందజేస్తామని చెప్పారు. రోడ్లపై వదిలి వెళ్లిన, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి తీసుకెళ్లని వాహనాలను కమిషనరేట్లో ఐదుసార్లు బహిరంగ వేలం నిర్వహించినట్లు చెప్పారు. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు దేహ దారుఢ్యానికి ప్రాధాన్యత ఇ వ్వాలని సూచించారు. వ్యాయామం, యోగా, ధ్యానంలను దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కమిషనరేట్కు అభినందన
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులను డీజీపీ మరోసారి అభినందించారు. నిందితులకు శిక్ష లు విధించబడడంలో కరీంనగర్ కమిషనరేట్ రాష్ట్రంలో 5వ స్థానంలో కొనసాగుతుందని చెప్పారు. వివిధ పని విభాగాల్లో కరీంనగర్ రా ష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్న విష యం విదితమే. పోలీ స్ కమిషనర్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ఏ చిన్న సందే హం వచ్చినా వెంటనే నివృత్తి చేసుకోవడం ద్వా రా ఈ గుర్తింపు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివా స్, ఏసీపీలు విజయసారథి, కరుణాకర్రావు, మదన్లాల్, కాశయ్య, సత్యనారాయణ, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, ప్రతాప్, ఎస్బీఐ సం తోష్ కుమార్తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.