రాయికల్ రూరల్, నవంబర్ 22 : జగిత్యాలకు దీటుగా రాయికల్ను అభివృద్ధి చేసేందుకు నిధులు వెచ్చించడంతోపాటు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. రాయికల్ పట్టణంలోని నాగారాం హనుమాన్ ఆలయం ఆవరణలో 59 లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మందికి 5.27 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి మాట్లాడారు. పేదలకు మేలు చేసే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్న సీఏం కేసీఆర్ సగటు జీవి ఆశాకిరణంగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు నిధులు వెచ్చించిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వైద్య వ్యవ్యస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 3.50 కోట్లతో రాయికల్ పట్టణంలో సమీకృత మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్పర్సన్ గండ్ర రమాదేవి. సహకార సంఘం అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, హనుమాన్ ఆలయం చైర్మన్ ఎనగందుల సత్యనారాయణ, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్రెడ్డి, శ్రీరాముల సువర్ణ, నాయకులు కోల శ్రీనివాస్, జక్కుల చంద్రశేఖర్, ఇంత్యాజ్, తలారి రాజే శ్, కొల్లూరి వేణు, మహేందర్ బాబు, ఎలిగేటి అనిల్, మోర రామ్మూర్తి, హూస్సేన్, తొగిటి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.