స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను శనివారం దేశరాజధాని న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికైన సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల మున్సిపాలిటీల అవార్డులను మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అన్నం లావణ్య, కమిషనర్లు వెల్దండి సమ్మయ్య, శ్యాంసుందర్రావు, మహ్మద్ ఆయాజ్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్తో కలిసి అందుకున్నారు. వీరితో పాటు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్ సైతం అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్లు, చైర్మన్, కమిషనర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు.
వేములవాడ/కోరుట్ల/ సిరిసిల్లటౌన్/ కొత్తపల్లి, అక్టోబర్ 1: కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ -2022 పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, కొత్తపల్లి కోరుట్ల మున్సిపాలిటీలకు అవార్డు వరించగా, శనివారం న్యూఢిల్లీలో రాష్ట్ర మంత్రి కేటీఆర్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు అవార్డులను అందుకున్నారు. దేశవ్యాప్తంగా 4355 మున్సిపాలిటీలు పాల్గొన్న ఈ పోటీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్పై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాల్లో ఇవి ఎంపికైన విషయం తెలిసిందే.
శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలోని తల్కతోర స్టేడియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్తో కలిసి చైర్పర్సన్లు జిందం కళ(సిరిసిల్ల) రామతీర్థపు మాధవి(వేములవాడ) అన్నం లావణ్య(కోరుట్ల), కమిషనర్లు వెల్దండి సమ్మయ్య, శ్యాంసుందర్రావు, మహ్మద్ ఆయాజ్ పురస్కారాలను స్వీకరించారు. వీరితో పాటు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్ పురస్కారం అందుకున్నారు.