స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ ప్రాంతీయ దవాఖానలో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి చకని స్పందన లభించింది. ముందుగా రక్తదాన శిబిరాన్ని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరానికి యువకులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వారితోపాటు ఏసీపీ కే వెంకటరెడ్డి, తహసీల్దార్ చింతల కోమల్రెడ్డి, తదితర ప్రముఖులు రక్తదానం చేశారు. శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 92 మంది రక్తదానం చేశారని వెల్లడించారు. ఈ శిబిరానికి ఎకువ మంది రక్తదాతలను ప్రోత్సహించిన హెల్త్ అసిస్టెంట్ కే సదానందం, ఎస్టీఎస్ కిరణ్రెడ్డి, దేవేందర్రెడ్డి, 104 అంబులెన్స్ డ్రైవర్ చంద్రశేఖర్తో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సహకరించిన దవాఖాన సిబ్బందిని డీఎంహెచ్వో జువేరియ, డిప్యూటీ డీఎంహెచ్వో చందు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మారపల్లి సుశీల, కల్లేపల్లి రమాదేవి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ సుధాకర్రావు, చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ రఘుపతి, వైద్యులు డాక్టర్ నారాయణరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సీహెచ్వో సాజీద్హుస్సేన్, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, హెల్త్ సూపర్వైజర్ ఎస్ రమేశ్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రఫీ, హెల్త్ అసిస్టెంట్ సదానందం, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కమిషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ రాంచంద్రారావు, వైద్యాధికారి ఊడుగుల సురేశ్ ప్రారంభించారు. కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. రెడ్క్రాస్ వైద్యుడు ఎంఎల్ఎన్ రెడ్డి పర్యవేక్షణలో 69 మంది రక్తదానం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, కమిషనర్, వార్డు కౌన్సిలర్లు రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జమ్మికుంట పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన సర్పంచ్, యువకులు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములుతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు. రక్తదానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.