బోయినపల్లి, ఆగస్టు 17: ‘ఆపదలో ఉన్న నిరుపేదలు అధైర్యపడవద్దు..కేసీఆర్ సర్కారు అండగా ఉంటది’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో ఖరీదైన చికిత్స చేయించుకున్నవారికి సీఎం సహాయనిధి ద్వారా భరోసానిస్తుందని చెప్పారు. గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసంలో వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్రావు, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రసిటి కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యుడు ముద్దం రవి, తడగొండ సర్పంచ్ చిందం రమేశ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మిరాజం, శంకర్, మల్లారెడ్డి ఉన్నారు.