కార్పొరేషన్, ఆగస్టు 9: వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న ప్రతి ఇంటిపైనా జాతీయజెండా రెపరెపలాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. భావితరాలకు దేశభక్తిని పెంపొందించేలా 15 రోజుల పాటు నిర్వహించే వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని 33వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి మేయర్ సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి జాతీయ జెండాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో 3,08,754 ఇండ్లను గుర్తించామని, వీటిలో కరీంనగర్ నగరపాలక సంస్థలో 79,953 గృహాలు ఉన్నాయన్నారు. ఈ నెల 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు. భావితరాలకు దేశభక్తిని పెంపొందించేలా 15 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ ఉత్సవాల్లో తలసేమియాతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా రక్తదానం, అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, దవాఖానల్లోని రోగులకు పండ్ల పంపిణీ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నామన్నారు.
ఈ నెల 16న నగరంలో ఎకడి వారక్కడే ఒకే సమయంలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాలాపన చేయాలన్నారు. సమైక్యాంధ్రలో ఎకువ కాలం సీఎంగా (8 ఏండ్ల 4నెలల 26 రోజులు) పనిచేసిన రికార్డు నారా చంద్రబాబునాయుడుకు ఉందని, ఆ రికార్డును ఈనెల 15తో సీఎం కేసీఆర్ బ్రేక్ చేయబోతున్నారని తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ప్రతి ఒకరూ జాతీయ జెండాను గౌరవించాలని, జెండా ఆవిష్కరించే సమయంలో నిబంధనను పాటించాలని, జెండా గౌరవానికి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. జాతీయ జెండా ఎగరవేసిన చోట దానికంటే పైకి, సమానంగా ఎలాంటి జెండాను ఎగరవేయకూడదని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.