కమాన్చౌరస్తా/ తిమ్మాపూర్ రూరల్, జూలై 22 : పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్రేట్తోపాటు, గోల్డ్ మెడల్ సాధించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు నియోజకవర్గ నేతలు, పలు సంఘాల నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శుక్రవారం నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ సదాశివపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చిలుక నరేందర్ గంగా ఆధ్వర్యంలో మాల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో రసమయిని కలిసి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు చిలుక శేఖర్, రాజు, అభిలాష్, మహేందర్, పోచమ్మ, కమల, రాజేశ్వరి, లక్ష్మి, రామచంద్రం, అరుణ్, రమేశ్, దేవేందర్, అశోక్, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు.