హుజూరాబాద్, జూలై 16: ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నలుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు. శనివారం నిందితులను అరెస్ట్ చేసిన హుజూరాబాద్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బండ్రుగూడకు చెందిన కావాలి శేఖర్, ఒడిశా రాష్ట్రం అమరకోట్ జిల్లా జలంగాపూర రాయిఘర్ మండలం దూర్ గ్రామానికి చెందిన దాలి సుప్రజిత్, నబురంపూర్ జిల్లా పపుదాండి మండలం చోద్రంగూడ గ్రామానికి చెందిన కాశీరాం జానీ అలియాస్ గాషిరాం, మల్కనగిరి జిల్లా నాగూడ మండలం గౌడగూడ గ్రామానికి చెందిన రమేశ్ శంషాబాద్లో సెంట్రింగ్ పని చేసేవారు. అకడ పని పూర్తి కాగా, ఉపాధి కోసం హుజూరాబాద్కు వచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ పకన ఒక పాత ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వర్షాలు పడుతుండగా వీరికి పని దొరకలేదు.
ఈ నెల 6న మధ్యాహ్నం వీరు టీ తాగడానికి బస్టాండ్కు వచ్చారు. అకడే ఉన్న ఇండియా వన్ ఏటీఎంలో బ్యాంక్ సిబ్బంది డబ్బులు పెడుతుండగా చూశారు. అదే రోజు అర్ధరాత్రి ఏటీఎం వద్దకు వచ్చి గడ్డపార, సుత్తెలతో దానిని పగులగొట్టేందుకు యత్నించి విఫలమై వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు బస్టాండ్లోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్టీం సాయంతో ఫింగర్ ప్రింట్స్ తీసుకొని సీఐ శ్రీనివాస్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి పర్యవేక్షణలో నలుగురితో టీంను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు.
ఈ నెల 15న మధ్యాహ్నం ఎస్ఐ ఆసిఫ్ తన సిబ్బందితో సిర్సపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ఏటీఎం చోరీ, హుజూరాబాద్ చుట్టుపకల గ్రామాల్లో దొంగతనాలు చేయడానికి ప్లాన్ వేసుకున్నట్లు వీరు ఒప్పుకొన్నారు. కాగా, వారి నుంచి ఏటీఎంను పగులగొట్టేందుకు వినియోగించిన గడ్డపార, రెండు సుత్తెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని డీసీపీ శ్రీనివాస్ అభినందించారు. రూరల్ సీఐ జనార్దన్, ఎస్ఐ రాజన్న, కానిస్టేబుళ్లు రవి, శ్రీధర్ ఉన్నారు.