మానకొండూర్, జూలై13: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపలు పట్టారు. తొలిపొద్దు కార్యక్రమంలో పలు గ్రామాల్లో కలియదిరిగిన ఆయన, తిరుగు పయనంలో మానకొండూర్ పెద్ద చెరువును పరిశీలించారు. మత్తడి దూకుతుండడంతో అక్కడే ఉన్న మత్స్యకారులతో కాసేపు మాట్లాడారు. వర్షంలోనూ వారితో కలిసి చేపలు పట్టారు. ఎమ్మెల్యే విసిరిన వలకు రెండు రవ్వులు చిక్కగా, మత్స్యకారులు సంబురపడ్డారు. ఎమ్మెల్యే వెంట సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, నాయకులు పిట్టల మధు, నెల్లి మురళి, శాతరాజు యాదగిరి ఉన్నారు.