కమాన్చౌరస్తా, జూలై 2: డిగ్రీ ప్రవేశాలకు వేళయింది. అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం కోర్సుల్లో సీట్లను మూడు ఫేజుల్లో భర్తీ చేయాని నిర్ణయించిన యంత్రాగం, అనుమానాల నివృత్తికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాల హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. అన్న సందేహాలపై నమస్తే అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
సులువుగా రిజిస్ట్రేషన్..
దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందు ఉంచింది. ఇందు కోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ- యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కాలేజీకి వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం..
దోస్త్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉన్నది. దోస్త్ లాగిన్తో ఆన్లైన్ ఫాం నింపే క్ర మంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వివరాలను చూసుకుని వారికి నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీలో వాటికి అనుసంధానంగా ఉన్న కాలేజీలో ప్రవేశం పొందవచ్చు.
సేవా కేంద్రం ద్వారా ఉచిత సేవలు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో శాతవాహన యూనివర్సిటీ, ఎస్ఆర్ఆర్ కళాశాలతోపాటు జమ్మికుంట, హుజురాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో విద్యార్థులు ఆధార్తోపాటు ఫారం కోసం రూ.200 చెల్లిస్తే ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కౌంటర్లో ఉన్న అధ్యాపకులు రిజిస్ట్రేషన్తోపాటు వెబ్ ఆప్షన్లుకూడా పెడతారు. ఈ క్రమంలో విద్యార్థులకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా వి ద్యార్థులు తామే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రమంలో ఏవైనా తప్పులు జరిగినా ఈ కేంద్రాల ద్వారా సరిదిద్దుకునే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు..
తొలి దశ రిజిస్ట్రేషన్: జూలై 1 నుంచి 30 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 6 నుంచి 30
ధ్రువపత్రాల పరిశీలన: జూలై 28, 29
సీట్ల కేటాయింపు: ఆగస్టు 6
సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 8 నుంచి 18 వరకు
రెండో దశ రిజిస్ట్రేషన్: ఆగస్టు 7 నుంచి 21 (రూ.400తో)
వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 7 నుంచి 22
సీట్ల కేటాయింపు: ఆగస్టు 27
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ దాకా
మూడో దశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 16
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు
ఓరియెంటేషన్: సెప్టెంబర్ 23 నుంచి 30 దాకా
అక్టోబర్ 1 నుంచి తరగతులు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..