చొప్పదండి, జూలై 2: రైతులకు మెరుగైన సేవలందించడానికే ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పేర్కొన్నారు. జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సహకార సంఘ కార్యాలయ ఆవరణలో శనివారం ఆయన సహకార జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సంఘం చైర్మన్ మాట్లాడుతూ, సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు రూ. లక్ష ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ గుర్రం ఆనందరెడ్డి, కార్యదర్శి కళ్లెం తిరుపతిరెడ్డి, సిబ్బంది మహిపాల్రెడ్డి, తిరుపతి, శ్రీపాల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాజేశం, మోహన్, శ్రీకాంత్, కావ్య, మహబూబ్ అలీ, లక్ష్మయ్య, వంశీ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 2: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంపై దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు జెండా ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సంఘంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు 100 శాతం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. సంఘం వైస్ చైర్మన్ గోనె నర్సయ్య, డైరెక్టర్లు అంజయ్య, లచ్చయ్య, తిరుపతి, రమేశ్, సీఈవో మనోజ్కుమార్ పాల్గొన్నారు.