తిమ్మాపూర్ రూరల్, జూలై1: వాహనదారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు త్రైమాసిక పన్నులు చెల్లించాలని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ సూచించారు. పెండింగ్లో ఉండి తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి, భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. శుక్రవారం తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రవాణాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022-23 సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు రహదారి భద్రతను పెంపొందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఓవర్లోడ్, రోడ్ టాక్స్, ఫిట్నెస్ లేని వాహనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే వాహనదారులకు మెరుగైన సేవలందించాలని, టీఆప్ పోలియో యాప్పై అవగాహన కల్పించాలని చెప్పారు.
కార్యాలయాలకు భూమి సాధించాలి
వివిధ ప్రాంతీయ, జిల్లా కార్యాలయాలకు ప్రభు త్వ భూమి, కార్యాలయం లేకుంటే ఆయా జిల్లాల కలెక్టర్లను సంప్రదించి కేటాయించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ భూమి ఉన్న కార్యాలయాలు బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ పెద్దపల్లి డీటీఓ రంగారావు, జగిత్యాల డీటీవో శ్యాం నాయక్, సిరిసిల్ల డీటీవో కొం డల్రావు ఎంవీఐ, ఏఎంవీఐలు అల్లె శ్రీనివాస్, ఉమామహేశ్వర్రావు, నాగలక్ష్మీ, సిరాజుద్దీన్, మసూద్అలీ, వంశీ, కిశోర్చంద్రరెడ్డి, రంజిత్, రవి, భీంసింగ్, అశోక్, కరుణాకర్ ఉన్నారు.