గంభీరావుపేట, జూలై 1: ‘కేసీఆర్ సారథ్యంలో ఎనిమిదేండ్లలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. చేతికొచ్చిన పంటలపై మిడతలు దాడి వలె ప్రగతిలో దూసుకెళ్తున్న తెలంగాణపై దాడి చేసేందుకు వలసరావడం రావడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు అతిథి గృహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. 75 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో చేసి చూపారని, తెలంగాణలో బంగారు పంటలు పండి పల్లెల్లో రైతులు సంతోషంగా పండుగలు జరుపుకుంటే, కుల, మతం పేరిట బీజేపీ రెచ్చగొడుతున్నదని దుయ్యబట్టారు.
మా పథకాలు ఉన్నాయా: కొండూరి
‘రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. ఇంకా 119 నియోజకవర్గాల్లో పల్లె ప్రగతి కింద చేపట్టిన ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, హరితహారం, రైతు వేదికలతో ప్రజల సమస్యలన్నీ తీరాయి. ఇటువంటి పథకాలు, కార్యక్రమాలు మీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా..? చెప్పాలని’ కొండూరి రవీందర్రావు బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనబోమంటే సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో గ్రామాల వారీగా సెంటరు పెట్టి చివరి గింజ వరకూ కొనుగోలు చేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు మోసపూరితమైన మాటలు చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఒకసారి సందర్శించాలని సూచించారు. 2014కి పూర్వం.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సమగ్రాభివృద్ధిపై సత్తా చాటుతూ మన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. ఇక్కడ ఎంపీపీలు వంగ కరుణ, జనగామ శరత్రావు, జడ్పీటీసీలు కొమిరిశెట్టి విజయ, గుండం నర్సయ్య, సర్పంచులు ఎడబోయిన రాజు, అల్లె సత్యం, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, వైస్ ఎంపీపీ దోసల లత, ఎంపీటీసీ గొర్రె బాలమణి, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, కమ్మరి రాజారాం, గంద్యాడపు రాజు, రాజనర్సు, ఎగదండి స్వామి, రత్నాకర్, రాజేందర్, రాజేశ్వర్రావు, లక్కిరెడ్డి లత, బాలలక్ష్మి, చెవుల మల్లేశం, వెంకటియాదవ్, నాయకులు తదితరులు ఉన్నారు.