‘జీవుల మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన ‘ప్లాస్టిక్ను తరిమేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ హుజూరాబాద్ బల్దియా పాలకవర్గం పట్టణ ప్రజలకు పిలుపునిచ్చింది. శుక్రవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సింగిల్ యూజ్ కవర్లతో కలిగే అనర్థాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు.
చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ వెంకన్న ప్లాస్టిక్ను వాడబోమని ప్రతిజ్ఞ చేయించారు. నిషేధానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
– హుజూరాబాద్ టౌన్, జూలై 1