తెలంగాణ చౌక్, జూలై 1: జిల్లా వ్యాప్తంగా గురువారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తాచాటా రు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం సన్మానించారు. భవిష్యత్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 10జీపీఏ సాధించిన కొలిపాక అక్షయ, 9కి పైగా జీపీఏలు సాధించిన విద్యార్థులను మున్సిపల్ చైర్పర్సన్ జింద కళ సన్మానించారు. అలాగే వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్తాచాటిన విద్యార్థులను డీఈవో రాధాకిషన్ అభినందించారు. ఇక్కడ కౌన్సిలర్లు కల్లూరి రాజు, గెంట్యాల శ్రీనివా స్, ఆకుల చిన్న, హెచ్ఎం మల్లేశం, ఇన్చార్జి హెచ్ఎం గోపాల్రెడ్డి, ఉపాధ్యాయులు పురుషోత్తం, పాకల శంకర్, ప్రభాకర్, ఆంజనేయులు, దేవయ్య, బాబు ఉన్నారు.
తంగళ్లపల్లిలో..
సిరిసిల్ల రూరల్, జూలై 1: తంగళ్లపల్లి మండలంలోని శుభోదయ పాఠశాల విద్యార్థులు, కరస్పాండెంట్ శ్రీనివాస్యాదవ్ శుక్రవారం డీఈవో రాధాకిషన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10జీపీఏ సాధించిన ఇద్దరు విద్యార్థులు సాగర్, అజయ్రాహుల్ను ఆయన అభినందించారు. ఇక్కడ ప్రిన్సిపాల్ లింగారావు, తదితరులు ఉన్నారు.
‘గురుకుల’ ప్రిన్సిపాల్కు సన్మానం
సిరిసిల్ల రూరల్, జూలై 1: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గుగ్గిళ్ల సంజీవ్గౌడ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ పద్మతోపాటు ఉపాధ్యాయ బృందాన్ని సన్మానించారు. ఇక్కడ కొక్కిరాల సూర్యారావు, కొక్కిరాల ఆగంరావు, పన్యాల శ్రీనివాసరెడ్డి, మల్లేశ్బాబు, కొలపురి నరేశ్, ఆవునూరి అంజనేయులు, శ్రీకాంత్, చంద్రం తదితరులు ఉన్నారు.
కోనరావుపేటలో..
కోనరావుపేట, జూలై 1: ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను సర్పంచ్ గున్నాల అరుణ, పాలకవర్గ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాతో సన్మానించారు. ఇక్కడ హెచ్ఎం స్వప్న, నాయకులు గున్నాల లక్ష్మణ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
వేములవాడలో..
వేములవాడ, జూలై 1: పట్టణంలోని కిడ్స్కాన్వెంట్ పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు మణిదీపక్, బండ సరయును ప్రిన్సిపాల్ దరక్షణ్ వస్ఫియా, కరస్పాడెంట్ నరాల దేవేందర్ సన్మానించారు. కృష్ణవేణి ఈ టెక్నో విద్యా ర్థి గౌతమ్రెడ్డిని ఎస్పీ రాహుల్హెగ్డే అభినందించి, పుస్తాకాన్ని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబర్చి న విద్యార్థులకు రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీరగోని ఆంజనేయులు జ్ఞాపికలు, ఉపాధ్యాయుడు కట్ట రవీందర్ రూ.500 పారితోషకం అందజేశారు.
ఇల్లంతకుంటలో..
ఇల్లంతకుంట, జూలై 1: బైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన వల్లంపట్ల గామానికి చెందిన అనుముల అంకితను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ శుక్రవారం సన్మానించారు. అంకిత పట్టుదల, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల ఆత్మవిశ్వాసం అందించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుం బ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ నాయకులు భూం పెల్లి రాఘవరెడ్డి, కేశవరెడ్డి, ఆనందరెడ్డి, కట్ట గురువారెడ్డి, రాజశేఖర్గౌడ్, బాలయ్య, ప్రసాద్, రమేశ్ ఉన్నారు.
ముస్తాబాద్లో..
ముస్తాబాద్, జూలై 1: పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను ఎంపీపీ జనగామ శరత్రావు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు. ఇక్కడ జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కిషన్రావు, ఎంపీటీసీ కచం మంజుల, మండల కో ఆప్షన్ సభ్యుడు షాదుల్పాషా, టీఆర్ఎస్ పట్టణాఅధ్యక్షుడు నర్సింహారెడ్డి, నర్సింహులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేటలో..
ఎల్లారెడ్డిపేట, జూలై 1: గొల్లపల్లిలోని జ్ఞానదీప్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పీ శృతి, పీ సృజన్ 10 జీపీఏ, కే సామ్య, ఐ రుత్విక్, ఈ కీర్తన, ఎస్ అక్షయ, సీహెచ్ లక్ష్మీహారిక, పీ వర్ష, సీహెచ్ హర్షిత్, సీహెచ్ శ్రావణి 9.8 జీపీఏ సాధించారు. కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. ఇక్కడ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు వర్స కృష్ణహరి, ఇల్లెందుల శ్రీనివాస్రెడ్డి, పిల్లి కిషన్, సీత్యానాయక్, ఆంజనేయులుగౌడ్ తదితరులు ఉన్నారు.