విద్యానగర్, జూలై 1: విద్యార్థినులు పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐఎంఏ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినులకు వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, రుతుస్రావం సరిగ్గా కాకపోవడంతో పాటు చర్మ వ్యాధులు, రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటికి ముఖ్యంగా సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడమే కారణమన్నారు. సుమరు 500 మంది విద్యార్థినులను పరీక్షించారు. ఇందులో 60 శాతం మందికి పైగా పది గ్రాముల కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నట్లు గుర్తించారు. వారికి విటమిన్ మాత్రలు, సిరప్లు అందజేశారు. విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లు అందించారు. వైద్యులు ఆడెపు శైలజ, సంధ్య, ప్రియాంక, హారిక, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో..
నగరంలోని కేశవ ఈఎన్టీ దవాఖాన ఆవరణలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏసీపీ తుల శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. వైద్య వృత్తి గొప్పదని కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యులు చక్రవర్తుల రమణాచారి, అనిల్కుమార్, సుమన్, రవి, మల్లారెడ్డి, వేణుగోపాల్రావు, జయరామ్ తదితరులను క్లబ్ సభ్యులు సత్కరించారు. క్లబ్ సభ్యులు మనోహరచారి, అరవింద్బాబు, రామ్మోహన్రావు,రమేశ్, జగదీశ్వరాచారి, మధుసూదన్రెడ్డి, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
అపోలో దవాఖానలో..
నగరంలోని అపోలో రీచ్ దవాఖానలో డాక్టర్స్ డే వేడుకలను అడ్మినిస్ట్రేటర్ ప్రమోద్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
ఫార్చ్యూన్ మెడికేర్ దవాఖానలో..
నగరంలోని ఫార్చ్యూన్ మెడి కేర్ దవాఖానలో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులను దవాఖాన చైర్మన్ ముప్పిడి రాజశేఖర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఫార్చ్యూన్ మెడి కేర్ దవాఖాన వైద్యులు వేల మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దవాఖా సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, నగరానికి చెందిన వైద్యులు పాల్గొన్నారు.
విద్యానగర్, జూలై 1: నగరంలోని వాసుదేవ దవాఖానలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 137 ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల, చార్టర్డ్ అకౌంటెంట్స్, పోస్టల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న వైద్యులు ఎలగందుల శ్రీనివాస్, సౌమ్య శ్రీదేవి, సాయిప్రసాదరావు, రామకృష్ణ శ్రీరామోజు, సాయిలీల, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ నంబూరి విజయ్, కొత్తిరెడ్డి శ్రీధర్రెడ్డి, పోస్టల్ ఉద్యోగి నవీన్ను అలయన్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్స్, తపాలా ఉద్యోగులను సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గాలిపల్లి నాగేశ్వర్, సౌత్ ఇండియా చైర్మన్ బాలకృష్ణ, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, ఇంజినీర్ కోల అన్నారెడ్డి, సలహాదారు ఎలగందుల శ్రీనివాస్, వైస్ గవర్నర్ సౌమ్య శ్రీదేవి, సభ్యులు శ్రీనివాస్గాంధీ, చకిలం స్వప్న, మొగులోజు సత్యాచారి, వరుణ్ భూపతి, కర్ర వెంకన్న, వైద్యులు సాయిప్రసాద్ రావు, రామకృష్ణ శ్రీరామోజు, సౌమ్య శ్రీదేవి, సాయిలీల, సీఏలు నంబూరి విజయ్, కొత్తిరెడ్డి శ్రీధర్రెడ్డి, పోస్టల్ ఉద్యోగి నవీన్, వాసుదేవ దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
పారమిత పాఠశాలలో..
కమాన్చౌరస్తా, జూలై 1: పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో వైద్యుల దినోత్సవం నిర్వహించారు. వైద్యులు నరేంద్ర పటేల్, విద్యాధర రాణి, సిరిపురం నవీన్కుమార్ హాజరై ఆరోగ్య పరమైన సలహాలను విద్యార్థులకు అందించారు. పారమిత పాఠశాలల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు మాట్లాడుతూ.. వైద్యుల సేవలు అభినందనీయమని కొనియాడారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని వైద్యులు ప్రారంభించారు. వైద్యులను విద్యార్థులు, ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, వీయూఎం ప్రసాద్, వినోద్ రావు, ప్రిన్సిపాల్ సంజయ్ భట్టాచార్య, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రబింద్ర పాత్రో, లక్ష్మీదీప్తి, శ్రీలత పాల్గొన్నారు.