రాష్ట్రంలో వరి నాట్లకు వేళయింది. కొన్ని ప్రాంతాల్లో నార్లు పోస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పొలాలు దున్నుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో కొందరు రైతులు నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో నాట్లు వేసే ప్రధాన పొలం తయారీ, తర్వాత చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్తలు దేవ అనిల్, సిద్ది శ్రీధర్ వివరించారు.
– కాల్వశ్రీరాంపూర్, జూలై 8
ప్రధాన పొలం తయారీ
నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే గట్ల మీద ఉన్న కలుపు మొక్కలపై ఫారాక్వాట్ అనే కలుపు మందును, 8-10 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కలుపు ద్వారా వ్యాపించే తెగుళ్లు అరికట్టవచ్చు. సుమారు 10 రోజుల ముందుగానే పొలాన్ని దమ్ము చేయ డం ప్రారంభించాలి. 1-2 దఫాలు మురగ దు మ్ము చేయాలి. చివరి దఫా నాట్లు వేసుకునే ముం దు రోజుగానీ లేదా అదే రోజు గానీ దమ్ము చేసుకోవాలి. వరి మాగాణుల్లో వేసిన జీలుగ లేదా జను ము లేదా పెసర వంటి పచ్చిరొట్ట పైరులను 35-40 రోజుల తర్వాత భూమిలో కలియదున్నాలి. ఈ పచ్చిరొట్ట పైర్లు మురగడానికి పూర్తి భాస్వరం ఎరువును (125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్) దుక్కిలోనే వేసుకోవడం వల్ల భూసారం పెరిగే అవకాశం ఉంటుంది. నల్ల రేగడినేలల్లో పూర్తి పొటాష్ ఎరువును (30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేసుకోవాలి. నత్రజని మూడు సమ దఫాలుగా వేయాలి. మొదటి దఫా నత్రజని ఎరువును కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో (35 కిలోలు) వేయాలి.
నాట్లు
నాలుగు నుంచి ఆరు ఆకులు గల 25-30 రోజుల వయసున్న నారును, నారు కొనలను తుంచి వేసి పైపైన నాటుకోవాలి. దీనివల్ల పిలకలు పెరిగే అవకాశముంది. నాటిన తర్వాత లేదా నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 30 సెం.మీ కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.
ఎరువుల యాజమాన్యం
రెండో దశ నత్రజనిని దుబ్బు చేసే దశలో (ఎకరాకు 35 కిలోల యూరియా), మూడోసారి నత్రజనిని అంకురం ఏర్పడే దశలో (ఎకరాకు 35 కిలోల యూరియా) పూర్తిగా నీటిని తీసివేసి, బురద పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. చెల్క నేలల్లో(తేలిక)15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను దుమ్ములో, మరొక 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అంకురం ఏర్పడే దశలో యూరియాతో కలిపి చల్లుకోవచ్చు. l ప్రస్తుతం నెలకొన్న మబ్బు వాతావరణం వల్ల జింక్ లోపం ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా మొక్క ఎదుగుదల లోపించే అవకాశముంది. దీని నివారణకు జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
కలుపు యాజమాన్యం
సస్యరక్షణ చర్యలు
చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. దీనివల్ల వరిలో ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నివారణకు పిలకల నుంచి దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైర్లలో తప్పనిసరిగా నాటిన 25-30 రోజుల్లోపు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు లేదా, కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు లేదా క్లోరాన్తినిలిఫ్రోల్ 0.4జీ గుళికలు 4 కిలోలు నీరు పలచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లుకోవాలి. l 40-45 రోజులు దాటిన పైర్లలో అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఉన్నచోట ఆకుముడత లేదా కాండం తొలిచే పురుగు గమనిస్తే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాన్తి నిల్ఫ్రోల్ 20 ఎస్పీ 0.3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నీటి యాజమాన్యం
నాట్లు వేసేటప్పుడు పొలంలో నీళ్లు పలచగా ఉంచాలి. నాటేసిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలం లో పలచగా అంటే 2-3 సెం.మీ, చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు సు మారు 5 సెం.మీ నీటిమట్టం ఉండేటట్లు చూసుకోవాలి. కోతకు 15 రోజులు ముం దుగా నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి.
అగ్గితెగులు
ఈ తెగులు నివారణకు ఐసోప్రోథయోలిన్ 300 మి.లీ ఎకరాకు, లేదా కాసుగామైసిన్ 500మి.లీ ఎకరాకు పిచికారీ చేయాలి.
సుడిదోమ
నాటిన 45-50 రోజులప్పుడు సుడిదోమ కనిపించే అవకాశం ఉంది. పిల్ల, తల్లి పురుగులు గుంపులు గుంపులుగా నీటి మట్టం పైభాగంలో దుబ్బుల నుంచి రసాన్ని పీల్చుతాయి. దీని నివారణకు పొలాన్ని ఆరబెట్టి ఎకరాకు ఇతోపెన్ ప్రాక్స్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా బ్యుప్రోఫేజిన్ 1.6మి.లీ లేదా డైనోటేఫ్యూరాన్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. l తొలిదశలో దోమ ఉధృతికి దోహదపడే పురుగుమందులైన క్లోరిపైరిఫాస్, ప్రొఫినోపాస్, సింథటిక్ పైరిథ్రాయడ్ను సిఫారసు చేయని బయో మందులను ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో వాడకూడదు.