కరీంనగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియలో కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ పాల్గొన్నారు.
కాగా, నగరంలోని ఎస్సారార్ కళాశాలలో జిల్లాలోని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 390 పోలింగ్ కేంద్రాల్లో 27 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లను ఆదివారం లెకించడానికి 22 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 28 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 22 మంది మైక్రో అబ్జర్వర్లు, 16 రిజర్వుడ్ సిబ్బందితో కలుపుకొని మొత్తం 88 మందిని నియమించారు. మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 316 పోలింగ్ కేంద్రాల ద్వారా 10 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లను లెకించడానికి 17 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లు, 14 మంది రిజర్వ్డ్ సిబ్బందితో కలుపుకొని 68 మందిని నియమించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాల ద్వారా 22 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లను లెకించడానికి 17 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 17 మంది మైక్రో అబ్జర్వర్లు, మరో 15 మంది రిజర్వ్డ్ సిబ్బందితో కలుపుకొని 69 మందిని నియమించారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని 327 పోలింగ్ కేంద్రాల్లో 14 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లను లెకించడానికి 16 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 16 మంది మైక్రో అబ్జర్వర్లు, మరో 14 మంది రిజర్వ్డ్ సిబ్బందితో కలుపుకొని 64 మంది చొప్పున మొత్తం 305 మందిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఓట్ల లెకింపు ప్రక్రియలో భాగంగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెకిస్తామని, అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెకించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాలుగు నియోజకవర్గాల ఆర్వోలు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, మహేశ్వర్, రాజు, సీపీవో కొమురయ్య, డీఐవో శివరాం, డీటీవో నాగరాజు, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఏర్పాట్లపై ఆర్వోలు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.