స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సంబురంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. ర్యాలీలు తీసి జై భారత్ నినాదాలు చేశారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మానకొండూర్, ఆగస్టు 15 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముద్దసాని సులోచన, పోలీస్ ష్టేషన్లో సీఐ వై కృష్ణారెడ్డి, మానకొండూర్ సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, పీహెచ్సీలో వైద్యాధికారి వినత, ఏఎంసీలో కార్యదర్శి నారా మనోహర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, చాణక్య ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ ఆడెపు రవీందర్, టీఆర్ఎస్ జెండాగద్దెవద్ద పార్టీ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, బీజేపీ కార్యాలయంలో పోల్సాని సుగుణాకర్రావు, గడ్డం నాగరాజు, ఎన్జీపీఎస్వో కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు బొద్దుల శ్రావణ్ జాతీయజెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీలు పిట్టల కవిత, ఉండింటి సులోచన, రామాంజనేయులు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంపీవో రాజేశ్వర్రావు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, ఆగస్టు 15: గంగిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధులను సర్పంచ్ మాసం శాలిని – సాగర్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి సంపత్గౌడ్, ఎంపీటీసీలు రంగు భాస్కరాచారి, సంపత్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మారెడ్డి జెండాను ఆవిష్కరించారు. జడ్పీటీసీ శేఖర్ గౌడ్, ఎంపీపీ ముద్దసాని సులోచన-శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఎంపీటీసీలు పిట్టల కవిత, రామాంజనేయులు, ఉప సర్పంచ్ నెల్లి మురళి, వార్డు సభ్యులు, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, గిర్దావర్, సీనియర్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
గన్నేరువరం, ఆగస్టు 15 : స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మామిడాల సురేందర్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బావ్సింగ్, జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్రాచారి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
చిగురుమామిడి, ఆగస్టు 15: మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ముబీన్ అహ్మద్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దాస సుధాకర్, విండో కార్యాలయంలో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, మండల ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నాగశేఖర్, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, విజయలక్ష్మి, సెర్ప్ కార్యాలయంలో అధ్యక్షురాలు కోల హరిణి, గ్రామపంచాయతీలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మండల వ్యవసాయ కార్యాలయంలో ఏవో రంజిత్కుమార్, ఎమ్మార్సీలో హెచ్ఎం శోభారాణి, కస్తూర్బాలో ఎస్వో రజిత జాతీయ జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ఎంపీడీవో నర్సయ్య, పీఆర్ ఏఈ రవిప్రసాద్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజామొయినొద్దీన్, నాయబ్ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐలు రాజు, శైలజ, జూనియర్ అసిస్టెంట్ స్వరూపారాణి, అజ్మత్పాషా, నాయకులు బెజ్జంకి లక్ష్మణ్, ఆకవరం శివప్రసాద్, ఆకవరం భవాని, గూడెం లక్ష్మి, ఏలేటి రవీందర్రెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, ఎడవెల్లి భాసర్రెడ్డి, ఎండీ సర్వర్పాషా, చిట్టిమల్ల శ్రీనివాస్, పన్యాల భూపతిరెడ్డి, బుర్ర శ్రీనివాస్, బెజ్జంకి రాంబాబు, ముకెర సదానందం, పెనుకుల తిరుపతి, బెజ్జంకి అంజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 15: మండల పరిషత్ కార్యాలయం, బృహత్ పీపీవీలోని అమృత్ సరోవర్లో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్రావు, వ్యవసాయ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రశేఖర్, పీహెచ్సీలో డాక్టర్ షాకీర్ అహ్మద్, మండల వనరుల కార్యాలయంలో సీవో కుమారస్వామి, ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్యామల, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ జ్యోతి, కేజీబీవీలో ఎస్వో జ్యోతి, తాడికల్ ఎస్సారెస్పీ కార్యాలయంలో డీఈ కవిత, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, రైతు వేదికల్లో రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, వైసీపీ కార్యాలయాల్లో మండలాధ్యక్షులు, నాయకులు మహిపాల్, బసవయ్య, ఐలయ్య, రాజిరెడ్డి, సురేశ్, బ్యాంకు మేనేజర్లు, హెచ్ఎంలు, ఏఐటీయూసీ, కుల సంఘాల నాయకులు, జాతీయ జెండాలు ఎగురవేశారు. మొలంగూర్ ఖిల్లాపై ఎరడపల్లి యువకులు జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని ఆల్ఫ్రెడ్ నోబెల్ స్కూల్లో నర్సరీ విద్యార్థి అగస్త్య జనగణమన గీతం పాడి అబ్బురపరిచాడు. జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో జయశ్రీ, వైస్ ఎంపీపీ రమేశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు15: ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జెండావిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కనకయ్య, పోలీస్ స్టేషన్లో సీఐ శశిధర్రెడ్డి, ఎల్ఎండీ ఠాణాలో ఎస్ఐ ప్రమోద్రెడ్డి, స్త్రీ శక్తి భవన్లో ఐకేపీ ఏపీఎం రామ్మోహన్, వివిధ కార్యాలయాల్లో ఆయా శాఖల ఉద్యోగులు పతాకావిష్కరణ చేశారు. ఆయా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు.