చిగురుమామిడి, ఆగస్టు 10: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, ఎస్సై దాస సుధాకర్ పిలుపునిచ్చారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి 75 మొకలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 వరకు జాతీయ జెండాలను ప్రతి ఇంటా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, సర్పంచులు శ్రీ మూర్తి రమేశ్, గోలి బాపురెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్రీడం పారులను ఏర్పాటు చేశారు. బుధవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మొకలు నాటారు. గాగిరెడ్డిపల్లిలో సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి దేవాలయ ఆవరణలో 75 మొకలతో ఫ్రీడం పారు ఏర్పాటు చేశారు.
బొమ్మనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం మొకలు పంపిణీ చేశారు. విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని పాఠశాల ఆవరణలో మొకలు నాటారు. ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు10: వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. 75 ఆకారంలో పూల మొక్కలు నాటి, జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంపీవో కిరణ్కుమార్, సర్పంచ్ దుండ్ర నీలమ్మ-రాజయ్య, ఎంపీటీసీ వేల్పుల మమత తదితరులు పాల్గొన్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని ఎల్ఎండీ ఠాణాలో సీపీ సత్యనారాయణ పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు స్వాత్రంత్య పోరాట ఘటనలను ఉదహరించారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ప్రతి ఠాణా పరిధిలో వేడుకలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్, ఆర్ఐ ప్రతాప్, ఏసీపీ తాండ్ర కరుణాకర్రావు, సీఐ శశిధర్రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మానకొండూర్, ఆగస్టు 10: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పంచాయతీ కార్యదర్శి వంగల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శంకరపట్నం, ఆగస్టు 10: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా బుధవారం మండలంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేశవపట్నం బృహత్ పల్లె ప్రకృతివనంతో పాటు చింతగుట్ట, తాడికల్, వంకాయగూడెంలో వన మహోత్సవం నిర్వహించారు. ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీవో బషీరొద్దీన్, సర్పంచులు కిషన్రావు, సుజాత, ఆడెపు రజిత, ఏపీవో శారద, ఉప సర్పంచ్ హనుమంతు, పంచాయతీ కార్యదర్శులు, టీఏ సుమలత, వార్డు సభ్యులు, ఎస్హెచ్జీ మహిళలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కల్వల వైకుంఠధామంలో సర్పంచ్ దాసారపు భద్రయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చవన్లాల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గన్నేరువరం, ఆగస్టు 10 : తహసీల్దార్ బావుసింగ్, ఎస్ఐ మామిడాల సురేందర్, ఎంపీవో నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గన్నేరువరం, జంగపెల్లి గ్రామాల్లో మొక్కలు నాటారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.