గంగాధర, ఆగస్టు 10: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇస్లాంపూర్లో ఎల్లమ్మ ఆలయ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు వడ్లూరి అనిత, ఆకుల శంకరయ్య, జోగు లక్ష్మీరాజం, ముక్కెర మల్లేశం, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు ఎగుర్ల మల్లయ్య, వడ్లూరి ఆదిమల్లు, సామంతుల శ్రీనివాస్, వేముల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.