విద్యానగర్, మార్చి 23 : రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న కరీంనగర్ సహకార బ్యాంకు కు జాతీయ ఖ్యాతి దక్కడం గర్వకారణమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. సిబ్బంది కృషితోనే ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో9001, 10002 సర్టిఫికెట్లు దక్కాయని చెప్పారు. బుధవారం కరీంనగర్లోని డీసీసీబీ బ్యాంక్లో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించిన సమావేశంలో కొండూరి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ డీసీసీబీతో సమానంగా అన్ని సంఘాలు పనిచేయాలన్నారు. కరోనా నేపథ్యంలో కూడా సహకా ర బ్యాంకులు రైతాంగానికి విశిష్ట సేవలు అందించాయని గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు సిబ్బందికి నివాళులర్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం పెంపుపై కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత, నిర్దిష్టమైన పాలసీ అమలుకు ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకు సిబ్బందికి కేటగిరీల వారీగా హెచ్ఆర్ఏ అందజేయనున్నారన్నారు. సంఘాలను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆయా సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం అందుతుందని పేరొన్నారు. కేంద్ర సహకార బ్యాంకులు సొంత భవనాలతోపాటు సోలార్ వ్యవస్థలు కలిగి ఉన్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ను ఛత్తీస్గఢ్, బిహార్ రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించారని తెలిపారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల గౌరవ వేతనం పెంపునకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, కేడీసీసీబ్యాంక్ సీఈవో సత్య నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, పాలకవర్గ సభ్యులు మోహన్రెడ్డి, సింగిల్ విండోచైర్మన్లు జలగం కిషన్రావు, తిప్పని శ్రీనివాస్, పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, వేసిరెడ్డి దుర్గా