జమ్మికుంట, ఏప్రిల్ 15: ఫ్లెక్సీ విషయంలో స్థాయిని మించి మాట్లాడితే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బీజేపీ నాయకుల్లారా అని టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు హెచ్చరించారు. పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఫ్లెక్సీని మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని, బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాం టి చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు. ఫ్లెక్సీ తొలగించడంపై మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం ప్రమేయం ఏంట ని ప్రశ్నించారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని తప్పుబట్టారు. మంత్రి ఆదేశాల మేరకు పాలకవర్గం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేని కబోదులు బీజేపీ నాయకులని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఒకవైపు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంటే, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందామని, ప్రజలకు భరోసానిద్దామని పేర్కొన్నారు. సమావేశం లో పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు, నాయకులు భిక్షపతి, నరేశ్, రాజయ్య, రాజు, రాము, రవీందర్, సారంగం, వీరన్న, రాము, శివశంకర్, శ్రీనివాస్, కోటి, శ్రీహరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కథ ఏంటో తెలుసా..?
మెగాఫోన్ పట్టిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్..హీరో ఎవరంటే..?