ఉపప్రధానిగా ఆయన సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఘనంగా జయంతి వేడుకలు
విగ్రహాలు, చిత్రపటాల వద్ద ఘన నివాళి
తెలంగాణచౌక్, ఏప్రిల్ 5: భారత తొలి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తాలోని జగ్జీవన్రాం విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్రాం సేవలను కొనియాడారు. రెవెన్యూ అధికారి వెంకటమాధవరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నతానియల్, డీఆర్డీవో ఆనంద్కుమార్ పాల్గొన్నారు. ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, మాలమహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనమల మంజుల తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్లోని ఆయన విగ్రహానికి ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అకౌంట్స్ ఆఫీసర్ లావణ్య, డిపో మేనేజర్లు అర్పిత, మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య పాల్గొన్నారు. మంచిర్యాల చౌరస్తాలోని జగ్జీవన్రాం విగ్రహానికి జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆధ్యర్యంలో పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. నాయకులు సంకుల అనంతరావు, రాజారాం, యూత్ విభాగం జిల్లా కన్వీనర్ ఉయ్యాల విష్ణువర్ధన్, మహిళా విభాగం కన్వీనర్ శివరాణి తదితరులున్నారు.
కార్పొరేషన్, ఏప్రిల్ 5: మంచిర్యాల చౌరస్తాలోని జగ్జీవన్రాం విగ్రహానికి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ దంపతులు పూలమాల వేసి నివాళుర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. 3వ డివిజన్ కా ర్పొరేటర్ కంసాల శ్రీనివాస్, నాయకులు విజయ్, అనిల్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్కుమార్గౌడ్, నాయకులు చుక్క శ్రీనివాస్, బొంకూరి మోహన్, వడ్లకొండ పరశురాములు, భూమేశ్, ఆనంద్ జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యానగర్, ఏప్రిల్ 5: బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు సోమిడి వేణు ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో, మంచిర్యాల చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు జానపట్ల స్వామి, కటకం లోకేశ్, కన్న కృష్ణ, జాడి బాల్రెడ్డి, బండారి వేణుగోపాల్రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, ప్రవీణ్, బండ రమణారెడ్డి, సుధాకర్పటేల్ పాల్గొన్నారు. అలాగే 19వ డివిజన్లోని రేకుర్తి కంటి దవాఖాన కమాన్ వద్ద కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించగా, నాయకులు దీకొండ కిష్టయ్య, దుర్గం మారుతి, బడుగు నరేశ్, అస్తపురం విక్రం, తిరుపతి, ఎదుల లింగయ్య, కుంభాల కిష్టయ్య, కత్తెరపాక ఆంజనేయులు, పొత్తూరి దేవదాసు, మానువాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏఫ్రిల్ 5: ఎంపీడీవో కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటానికి ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ జి.సంపత్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే సర్కిల్ కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటానికి టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..