ముస్తాబాద్. ఫిబ్రవరి 22: మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న కాళేశ్వర గంగను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ నీరు దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని కొచ్చెరువుకు చేరి, అక్కడి నుంచి మోహినికుంట చెక్ డ్యాం నిండుకొని ముస్తాబాద్ పెద్ద చెరువులకు నీరు చేరుతున్నది మరో ప్రధాన కాల్వ ద్వారా మద్దికుంట, మొర్రాయిపల్లె, చీకోడు చిప్పలపల్లికి తరలివస్తుండగా, మండలంలోని 22 గ్రామాలకు పుష్కలంగా నీరందనున్నది. యాసంగి పంటల కోసం మల్లన్న సాగర్ నుంచి జలాలు తరలివస్తుండగా, రైతులు, ప్రజాప్రతినిధులు సంబురపడుతున్నారు. బుధవారం మోహినికుంట రాజక్కపేట సరిహద్దులోని కాలువ వద్ద జలాలను ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్రావు, వెన్నమనేని పూర్ణచందర్రావు (చందు) మాజీ జడ్పీటీసీ మేర్గు యాదగిరిగౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్రావు, సర్పంచ్ పర్వతాలు, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, రాజిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండల్లో మరో మారు చెరువులు, కుంటలు అలుగు దూకబోతున్నాయని, నీటిని విడుదల చేయించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు మండల ప్రజలపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.