తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 26: అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మ న్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. తిమ్మాపూర్ మండలం వచ్చునూర్లో శనివారం ఆయన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. గన్నేరువరం మండలంలో విస్తృతంగా పర్యటించారు. గుండ్లపల్లి, జంగపల్లి, హన్మాజిపల్లి, సంగెం, మైలారం, గన్నేరువరం గ్రామాల్లో సీఎం రిలీఫ్ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభు త్వం, సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. అనంతరం గన్నేరువరం, జంగపల్లి జడ్పీ స్కూళ్లలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు.
మన స్వేచ్ఛకు రాజ్యంగమే కారణం
బానిస బతుకుల స్వేచ్ఛకుఅంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని ఎమ్మెల్యే రసమయి బా లకిషన్ అన్నారు. గన్నేరువరంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా, ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నేతలతో కలి సి పూలమాల వేశారు. భారతదేశ యావత్ ప్రజానికానికి న్యాయాన్ని అందించిన రోజు 1949 నవంబర్ 26 అని పేర్కొన్నారు. మనువాద పాలనకు చరమగీతం పాడిన రోజు ఈరోజని అభివర్ణించారు తిమ్మాపూర్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నేతలు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఉమారాణి, పాశం అశోక్రెడ్డి, జలపతి, గన్నేరువరంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఉన్నారు.