కరీంనగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన దూల స్వామి, చిట్యాల గంగాధర్, కనుక ప్రకాష్, కొత్తురి నారాయణ, మాంకలి మధుకర్, మంకలి సుధాకర్, దొనకొండ అంజయ్య, కొలపూరి శంభులింగం, దొనకొండ అనిల్, కోటగిరి ప్రభాకర్, మల్యాల రుఖ్మకర్ టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మల్యాల సర్పంచ్ మిట్టపెల్లి సుదర్శన్,TRS పార్టీ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, తక్కలపెల్లి సర్పంచ్ గొడుగు కుమారస్వామి, సీనియర్ నాయకులు దొనకొండ రమేష్ పలువురు పాల్గొన్నారు.