కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లాలోని మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ఎమ్మెల్యే రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మునుగోని రాకేష్, సింగిల్ విండో చైర్మన్ బోయినపల్లి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.