మల్లాపూర్, జనవరి 19 : నిజాంబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు అందరికి మోసపూరితమైన హామీలిచ్చి గెలుపొందిన అబద్ధాల ఎంపీ అరవింద్ కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని వైస్ ఎంపీపీ గౌరు నగేష్ అన్నారు.
బుధవారం మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం ఆవరణలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 18 న ఎంపీ పర్యటించిన స్థలాన్ని గోదావరి నీటిలో పాలను కలిపి శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంపీ అరవింద్ఎన్నికల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నెల రోజుల్లో ముత్యంపేట చక్కెర కర్మాగారంను తెరిస్తే పార్టీలకతీతంగా ఎంపీ చిత్రపటానికి మేమే పాలాభిషేకం చేస్తామని స్పష్టం చేశారు.
కోరుట్ల నియోజకవర్గంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఎంపీ అరవింద్ నియోజకవర్గంలో పర్యటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.