జగిత్యాల : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( మార్చి 1వ తేదీ నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ ( Police Act ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar )ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడొద్దని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసు వారికి ఈ విషయంలో సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎప్పీ కోరారు.