జగిత్యాల : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్(MP Aravind) ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ(BJP) సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలో బుధవారం అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను (Effigy burnt) దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీని ఎన్నో ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు.
ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, పరోక్షంగా పోలీసు కేసులను (Police Case) పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే కూలీల మాదిరి కార్యకర్తలు వస్తారని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు అమ్ముడుపోయే వ్యక్తులకు టికెట్లు, బాధ్యతలు ఇచ్చి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్కు తప్ప పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీటీ శేఖర్ రావు, విద్య సింగ్, ఎడమల వెంకట్ రజం, లింగాల శ్రీకాంత్ రావు, బావేటి శ్రీనివాస్, గోగికర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు