జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఫైనాన్సింగ్ సంస్థల నిర్వాహకులు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలలో రెండు, మెట్పల్లిలో 16, కోరుట్లలో 7 ఇళ్లలో సెర్చ్ నిర్వహించారు. సోదాల అనంతరం.. వారి నుంచి రూ.30 లక్షల నగదు, 272 ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీగా సేల్ డీడ్లు, ఖాళీ చెక్కులు, పాసు పుస్తకాలను పోలీసులు సీజ్ చేశారు.