Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 10: కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మై భారత్ అనుబంధంగా పత్తిపాక యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
యూత్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని సాంప్రదాయ, సాంస్కృతిక అంశాలపై ప్రదర్శనను తిలకిస్తాడు .ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్, అధ్యక్షుడు సిద్ధార్థ్,జనరల్ సెక్రెటరీ రిషి, ప్రచార కార్యదర్శి రాకేష్ కుమార్, నరేష్ ,యూత్ సభ్యులు ఇర్ఫాన్ ను అభినందించారు.