జగిత్యాల : జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ , రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక్టర్ బుధవారం సంబంధించిన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధరణిలో అప్డేట్స్పై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. అలాగే జాతీయ రహదారుల భూ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.