జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.లక్ష ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల పట్టణం 19వ వార్డుకు చెందిన గుండా రాజయ్యకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రాజయ్య పట్టణ టీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు రామకృష్ణతో కలిసి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి లక్ష రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించారు.
సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన లక్ష రూపాయల విలువగల ఎల్వోసీని రాజయ్యకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ముస్కు నారాయణ రెడ్డి, తోటమల్లికార్జున్, ఏఎంసీ వైస్ చైర్మన్ అసిఫ్, నాయకులు చదువుల కోటేష్, వొద్ధి రామ్మోహన్ రావు, కురుమ సంఘ నాయకులు గంగమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.