జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నిరుపేదలకు ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 15 మంది నిరుపేదలకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు ఎమ్మెల్యే చేశారు.
అనంతరం వారికి ఉచిత కండ్లద్దాలు, మందులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బొడ్ల జగదీష్, రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముకీద్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కూతురు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.