జగిత్యాల : జగిత్యాల పట్టణ మున్సిపల్ రోటరీ పార్క్లో ఓపెన్ జిమ్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పార్క్లో వాకింగ్ ట్రాక్, టైల్స్ వివిధ అభివృద్ధి పనులను పునః ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యాయామంతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, లైబ్రరీ చైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ దాసరి లావణ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.