జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసి మెగా రక్త దాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం డిపో దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతుందని అన్నారు.
నేడు ప్రభుత్వ జనరల్ దవాఖానలో నలుగురు నేత్ర వైద్యులు ఉన్నారని, అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిపో మేనేజర్ నర్సప్ప, ఆర్టీఏ జిల్లా మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్లు వోద్ది శ్రీలత, జుంబార్తి రాజ్ కుమార్, పట్టణ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, నాయకులు చందా పృథ్వీ, పీఏసీఎస్ చైర్మన్ వేణు, ఆర్టీసీ ఉద్యోగులు,తదితరులు, పాల్గొన్నారు.