జగిత్యాల : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మను సంబురంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
బీర్పూర్ మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. దీంతో చేనేత కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్గా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.