జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణానికి చెందిన శీలం సురేష్, నంబి పార్థసారథి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా వెనుబడిన వారికి కష్ట కాలంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు బొడ్ల జగదీష్,క్యాదాసు నవీన్, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ టివి సూర్యం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.